న్యూఢిల్లీ: ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) జరగకపోతే టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని జాతీయ జట్టులోకి రీఎంట్రీ అనేది దాదాపు అసాధ్యమేనని మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్పై ధోని భవితవ్యం ఆధారపడి వుందనేది కాదనలేని సత్యమని గంభీర్ పేర్కొన్నాడు. సుమారు ఏడాది కాలంగా జట్టుకు దూరమైన ధోనికి జట్టులోకి తీసుకోవడానికి ఏ ప్రాతిపదికా లేదన్నాడు. ధోని స్థానంలో కేఎల్ రాహుల్ అత్యుత్తమని గంభీర్ అభిప్రాయపడ్డాడు. ధోనికి ప్రత్నామ్నాయం రాహులేనన్నాడు. గత కొంతకాలంగా రాహుల్ ప్రదర్శన చూస్తున్నానని, అటు బ్యాటింగ్లోనూ ఇటు కీపింగ్లోనూ ఆకట్టుకుంటున్నాడన్నాడు. కీపింగ్లో ధోనిలా పూర్తి స్థాయిలో చేయలేకపోయినా రాహుల్ మాత్రం తన రోల్కు న్యాయం చేస్తున్నాడనే విషయం ఇటీవల చూశానన్నాడు. రాహుల్ మూడు, నాలుగు స్థానాల్లో బ్యాటింగ్కు వస్తే భారత జట్టుకు లాభిస్తుందన్నాడు. (నా బ్యాటింగ్ స్టైల్కు ప్రేరణ అంగధ్జీ..)
ధోనికి ఎలా చోటిస్తారు..?